రాబోయే ఎన్నికల్లో అవినీతి BRS ని మతోన్మాదా బీజేపీ ని శక్తులను ఓడించాలి

CPI(ML) మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి గా ఎన్నికైన కొండా కౌశిక్

భద్రాచలం నేటి ధాత్రి

చర్ల మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం కోసం కష్టజీవుల, యర్రజెండా రాజ్యం స్థాపనకోసం నిరంతరం కృషి చేస్తా
చర్ల మండల కేంద్రంలో కామ్రేడ్ డీవీకే హాల్ లో జరిగిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ పూజారి సామ్రాజ్యం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన CPIML మాస్ లైన్ పార్టీ జిల్లాకార్యదర్శి కెచ్చేలా రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అవినీతి బిఆర్ఎస్ ను మతోన్మాద బిజెపి శక్తులను వారి మిత్రులను ఓడించాలి లౌకికవాద శక్తులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం పార్టీ అవసరాల రీత్యా ఇప్పటివరకు చర్ల పార్టీ మండల కార్యదర్శి గా ఉన్న కొండా చరణ్ న్ని రిలీవ్ చెయ్యడం జరిగింది ఈ రోజు జరిగిన మండల కమిటీ సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యుడు గా ఉంటూ పార్టీ మీడియా ఇంచార్జ్ భాద్యతల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఉన్న కామ్రేడ్(KK) కొండా కౌశిక్ ని CPIML మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ నూతన కార్యదర్శి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు పార్టీ భాద్యతలు అప్పగించిన జిల్లా మండల పార్టీ నాయకత్వానికి ధన్యవాదములు తెలిపారు పార్టీ తనపై నాపై పెట్టిన నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చెయ్యబోనని అన్నారు పార్టీ క్రమశిక్షణ కు నిర్మానానికి సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని అన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు చర్ల మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం కోసం కష్టజీవుల, యర్రజెండా రాజ్యం స్థాపనకోసం నిరంతరం కృషి చేస్తా ఈ కార్యక్రమం లో పార్టీ డివిజన్ కార్యాదర్శి కొండా చరణ్, దాసరి సాయన్న, పార్టీ మండల నాయకులు సిమిడి సుజాత, బోడ సందీప్ , రెడ్డి, ఉబ్బిడి నాగేష్, మెహమదా తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version