ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి :

గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం నర్సంపేట పట్టణంలో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభం చేసింది.కాగా ఆయా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.పనులను త్వరితంగా పూర్తి చేయుట కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే పలు సూచనలు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ నర్సంపేట ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ గోపాల్,డాక్టర్ మనోజ్ లాల్,పలువురు అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version