కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభించడం జరిగింది.
ఉదయం అల్పాహారం చేయకపోవడం వల్ల చదువుల పట్ల శ్రద్ధవహించక పోవడం జరుగుతుందని, విద్యార్థులకు అల్పాహారం ఇవ్వడం వలన పిల్లలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ దూస రఘుపతి,మండల నోడల్ అధికారి మురళి నాయక్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోనరావుపేట రాజేశం, ఉన్నత పాఠశాల నిజామాబాద్ ప్రధానోపాధ్యాయులు షాబుద్దీన్ , తదితరులు పాల్గొన్నారు.