ఉచిత రక్త పరీక్షలు చేయించుకోవాలి-కౌన్సిలర్ నల్లెల జ్యోతి అనిల్ కుమార్
పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ విలీన సీతారాంపురం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం రోజున లేబర్ డిపార్ట్మెంట్ సిఎస్సి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా క్యాంప్ కోఆర్డినేటర్ అండ్ డిస్టిక్ కోఆర్డినేటర్ సాగర్,సందీప్ మాట్లాడుతూ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 50 రకాల రక్త మరియు మూత్ర పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తున్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్,క్యాంపు సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.