బీఆర్ఎస్ గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది

మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్
లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అన్నారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్వ బిజెపి పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి..బీఆర్ఎస్ కు పట్టం కట్టి..తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో వినిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కత్తి రాజు గౌడ్, ఉపాధ్యక్షులు చిలువేరు సుమన్, ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రాజు, యూత్ అధ్యక్షులు మ్యాదరి రాజు, నాయకులు అన్నమనేని బాపురావు, సూరినేని భాస్కర్ రావు, కత్తి ప్రభాకర్, ఇంజపెల్లి రాజయ్య, మ్యాదరి దానయ్య, లోకుల బోయిన స్వామి, వైనాల స్వామి, భాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version