టెక్-అథాన్ 2026 విజయవంతం
* విజేతలకు నగదు బహుమతులు అందజేసిన విశ్వవిద్యాలయ ఫౌండర్ చాన్సలర్ డాక్టర్ సి.హెచ్. వి. పురుషోత్తం రెడ్డి
నేటిధాత్రి, చేవెళ్ల :
మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్ టెక్-అథాన్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ హ్యాకథాన్ మార్చి 30 మధ్యాహ్నం 2 గంటల నుంచి మార్చి 31 మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిఎస్ఈ, ఏఐ, ఎంఎల్, ఈసీఈ, బిసిఏ, బి.ఎస్సి కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం నమోదు చేసుకున్న 52 జట్లలో నుంచి ప్రతిభావంతమైన 15 జట్లను ఎంపిక చేసి, వాటికి ఏఐ, హెల్త్కేర్, వ్యవసాయం, విద్య, ఫోరెన్సిక్స్, ఐఓటీ వంటి విభిన్న రంగాల్లో వినూత్న ప్రోటోటైప్లను అభివృద్ధి చేసే అవకాశం కల్పించారు. ఈ హ్యాకథాన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మూడు జట్లను విజేతలుగా ఎంపిక చేసి, వారికి శనివారం నగదు బహుమతులను విశ్వవిద్యాలయ ఫౌండర్ చాన్సలర్ డాక్టర్ సి.హెచ్. వి. పురుషోత్తం రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఈ హ్యాకథాన్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, బృంద సహకారం, ప్రాయోగిక సమస్యల పరిష్కార నైపుణ్యాలు సమర్థవంతంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. సాత్విక రెడ్డి , వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. రవీందర్, డీన్ ఫాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆచార్య ఎం. జగదీశ్వర్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఈ. అరవింద్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
