తస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో ట్రస్మ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని పివిఆర్ గార్డెన్లో ప్రవేట్ పాఠశాలల క్రస్పాండెంట్ లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నియోజిక వర్గంలో ఉన్న ప్రతి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాశిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ రెడ్డి, చంద్రకళ, మరియు వేలాది మంది టీచర్లు పత్రిక పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు,