చట్టాలకు తూట్లు.. తహసీల్దార్ల సంపాదన కోట్లు!?
`ఫామ్ ల్యాండ్ల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు?
`విచ్చలవిడిగా నిబంధనలు పాతర పెడుతున్నారు?
`రెవిన్యూ వ్యవస్థను కొందరు తహసీల్దార్లు బ్రష్టు పట్టిస్తున్నారు?
`ప్రభుత్వ ఆదేశాలు, రెవిన్యూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు?
`ఓ వైపు ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తుంటే, తహసీల్దార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తూనే వున్నారు?
`పంచాయతీ రాజ్ 2018 చట్టానికి విరుద్ధంగా వ్యవహారిస్తున్నారు?
`హైడ్రా కమిషనర్ ఆదేశాలను అసలే లెక్క చేయడం లేదు?
`20 గుంటలు ఉంటే తప్ప ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొద్దు?
`గుంట,రెండు గుంటలకు కూడా కొందరు తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు?
`రియల్ వ్యాపారుల కొమ్ము కాసున్నారు?
`ప్రభుత్వ ఆదాయనికి గండి కొడుతున్నారు.
`చట్టాలను యదేచ్చగా ఉల్లంగిస్తున్నారు?
`ప్రజలను మోసం చేస్తున్న రియల్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారు?
`తహసీల్దార్ల అండ చూసుకొని రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు?
`భూములకు రక్షణగా నిలవాల్సిన తహసీల్దార్లే రియల్ వ్యాపారులతో చేతులు కలుపుతున్నారు?
`గుంట,రెండు గుంటలకు కూడా రైతు భరోసా, రైతు భీమా వస్తుందని రియల్ వ్యాపారాలు ప్రచారం చేస్తున్నారు?
`అమాయక ప్రజలకు ఫామ్ ల్యాండ్ పేరుతో భూములు అంట గడుతున్నారు?
`ఈ అక్రమ ప్రచారాలు తెలిసినా తహసీల్దార్లు నిమ్మకు నీరేతినట్లు వుంటున్నారు?
`ఇలాంటి రియల్ వ్యాపారాల మీద చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్లే చోద్యం చూస్తున్నారు?
`తహసీల్దార్ల కనుసన్నాల్లోనే రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు?
`ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెబుతూనే వున్నారు?
`తహసీల్దార్లు చేయాల్సింది చేస్తూనే వున్నారు?
`ఫామ్ ల్యాండ్ పై రంగనాధ్ ఎంత చెబుతున్నా ప్రజలు మోసపోతూనే వున్నారు?
`ఇలాంటి రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పిసరంతా?
`తహసీల్దార్ల జేబుల్లోకి వెళ్ళేది గుమ్మడికాయంత?
`అక్రమ రిజిస్ట్రేషన్లతో తహసీల్దార్లు కొందరు కోట్లు సంపాదించుకుంటున్నారు?
`ఏసీబీ అధికారులకు దొరకకుండా కొత్త కొత్త ఉపాయలతో లంచాలు తీసుకుంటున్నారు?
`శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు రచిస్తున్నారు?
`ఏసీబీ అధికారులు దాడి ముందే కనిపెడుతున్నారు?
`డబ్బులున్న సూట్ కేసులే రోడ్ల మీదకు విసిరేస్తున్నారు?
`ఎంత తరగని అక్రమ సంపాదన వుంటే అలా సొమ్ము విసిరేయగలరు?
హైదరాబాద్, నేటిధాత్రి:
కాణి లేనిదే కలం ముట్టని రెవిన్యూ యంత్రాంగం. లంచం లేనిదే సంతకం పెట్టడం లేదు. అక్రమార్కుల కోసం అవినీతి సంతకాలు చేస్తుంటారు? చట్టాలకు పెన్నుతో తూట్లు పొడుస్తున్నారు. ఇంకుతో ఇష్టారాజ్యం సాగిస్తున్నారు. చేతిలో పవన్ వుందని కదా! అని పనికి మాలిన పనులు చేస్తున్నారు. కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అటు జీతాలు, ఇటు లంచాలతో కొంత మంది తహిల్ధార్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇష్టారాజ్యంగా అడ్డూ అదుపులేని అక్రమ సంపాదనలకు తెగబడుతున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొలువులు చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్రజలనే మోసం చేస్తున్నారు. వ్యవస్ధను నిండా ముంచేస్తున్నారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. రియల్ వ్యాపారుల కోసం తమ ఉద్యోగాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీద బిక్కిని బాధలు పెడుతున్నారు. రియల్ వ్యాపారుల కొమ్ము కాస్తున్నారు. భూములను రక్షించాల్సిన తహిల్ధార్లే దగ్గరుండి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. సమాజమంతా చీ అంటున్నా తుడుచుకుపోతున్నారు. పేదల కన్నీళ్లు తాగుతున్నారు. ఓ వైపు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగిన జీవితాలతో వచ్చిన వెలుగులు చాలవనుకున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో ఇక ఈ ధరణి అంతా మాదే అన్నట్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు తెగబడ్డారు. దశాబ్ధ కాలంగా సంపాదించిన సొమ్ము చాలదన్నట్లు, నిత్య సంతర్పణలు లేకుండా బతకలేకపోతున్నారు. లక్షల్లో జీతాలు, నిత్యం లక్షల్లో లంచాలతో ఏటా కోట్లు సంపాదించుకుంటున్నారు. కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటున్నారు. రెవిన్యూ వ్యవస్థలో ఉద్యోగంతో కాసుల పంట పండించుకుంటున్నారు. తిండి గింజలు కూడా పండని భూములతో సతమతమౌతున్న రైతులనుంచి లంచాల రూపంలో లక్షలు తీసుకుంటున్నారు. పేద ప్రజలను వేదించుకు, పీడించుకుతింటున్నారు. మరో వైపు రియల్ వ్యాపారులకు సహకరిస్తూ, ప్రభుత్వ స్పూర్తి, చట్టాలను గంగలో కలుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం తెచ్చిన రెవిన్యూ చట్టాలున బుట్ట దాఖలు చేస్తున్నారు. పంచాయితీ రాజ్ 2018 చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కొత్తగా రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన హైడ్రాకు తహిసిల్ధార్లు భయపడడం లేదు. గత రెండేళ్ల కాలంగా హైడ్రా కమీషనర్ రంగనాధ్ ప్రజలు చైతన్యం చేస్తూనే వున్నారు. ఫామ్ లాండ్ పేరిట రియల్ వ్యాపారులు సాగిస్తున్న అక్రమ భూ దందాలను నమ్మకండి అని పదే పదే రెండేళ్లుగా చెబుతూనే వున్నారు. కాని ఆ మాటలు ప్రజలు వినడం లేదా? వినిపించుకోవడం లేదా? రియల్ వ్యాపారులు చెబుతున్న మాటలే నమ్ముతున్నారా? ఇప్పటికే ఎంతో మంది ఇలా ఫామ్ లాండ్స్ కొనుగోలు చేసి ఆగమైన సంఘటనలు అనేకం వున్నాయి. ఎంతో మంది తమ గోడును నిత్యం మీడియాతో పంచుకుంటూనే వున్నారు. హైడ్రా కమీషనర్ దాదాపు నిత్యం పదే పదే ప్రజలను చైతన్యం చేస్తూనే వున్నారు. అదే దారిలో నడవాల్సిన రెవిన్యూ ఉద్యోగులు, ముఖ్యంగా తహసిల్ధార్లు, ఆర్డీవోల అక్రమాలకు తెగబడుతున్నారు. హైడ్రా కమీషనర్ మాటలు కూడా పెడ చెవిన పెడుతున్నారు. ఫామ్ లాండ్ వ్యాపారం అంటే సుమారు 20 గుంటల భూమి వుండాలి. అంటే అర ఎకరం వుంటే తప్ప పామ్ లాండ్గా రిజిస్ట్రేషన్ చేయకూడదు. అది చట్టం చెబుతున్న మాట. పదే పదే హైడ్రా కమీషనర్ కూడా మొత్తుకుంటున్న మాట. కాని ఆయన మాటలు కూడా ఎవరూ ఎందుకు వినడం లేదనేది ఇప్పటికీ అర్దం కాకుండాపోతోంది. పైగా భూములకు రక్షణగా వుండాల్సిన రెవిన్యూ వ్యవస్ధ అవినీతి కూపంలో కూరుకుపోయింది. అవినీతి సొమ్ము తినకుండా రోజు గడపలేకపోతోంది. అయితే అందరూ కాదు. కొని అధిక శాతం ఉద్యోగులు లంచాలు లేకుండా కొలువు చేయడం లేదు. దాంతో విచ్చలవిడిగా నిబంధనలను పాతర పెడుతున్నారు. ఎక్కువ శాతం తహిసిల్ధార్ల మూలంగానే ఈ వ్యవస్ధ భ్రష్టుపట్టిపోతోంది. 20 గుంటలు వుంటే తేప్ప రిజిస్ట్రేషన్కు అవకాశం చట్టాన్ని తహిసిల్ధార్లు ఉల్లంఘించడం నేరం కాదా? ఈ దుర్మార్గం పై స్దాయి అదికారులకు కనిపించడం లేదా? అనేక సమస్యలు నిత్యం పత్రికల్లో వస్తూనే వున్నాయి. అయినా పై స్ధాయి అధికారులు కల్లు మూసుకుంటున్నారా? రెండు గుంటలు, ఐదు గుంటలు ఎలా ఫామ్ లాండ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? చట్టం ఎలా ఒప్ప్పుకుంటుందనుకుంటున్నారు? పైగా ఇలా ఐడు గుంటల భూమికి కూడా రైతు భరోసా వస్తుందని, రైతు భీమాకు అర్హులౌతారని రియల్ వ్యాపారులు మోసం చేస్నున్న సంగతి తహసిల్ధార్లకు కనిపించడం లేదా? ఏ ధైర్యంతో రియల్ వ్యాపారులు అలా బ్రోచర్లు ముద్రిస్తున్నారు. వాటిని ఎలా ప్రజలకు పంచుతున్నారు. రెవిన్యూ చట్టాలు ఎంత కఠిన తరంగా వుంటాయో తెలియకుండానే రియల్ వ్యాపారాలు చేస్తున్నారా? తహసిల్ధార్లే తమకు అండగా వుండగా చట్టమేమి చేస్తుందని రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారా? ఐదు గుంటలకు రైతు భరోసా అమలు చేస్తారని ప్రచారం చేస్తుంటే తహసిల్ధార్లు అడ్డుకోవాల్సిన అసవరం లేదా? ప్రజలను చైతన్యం చేసే బాధ్యత రెవిన్యూ అధికారులది కాదా? ఇలా సాగిస్తున్న రియల్ వ్యాపారం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆవ గింజంత వుంటోంది. అలా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న తహసిల్ధార్లకు గుమ్మడి కాయంత ముడుతోంది. అంటే పిసరంత ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంటే తహసిల్ధార్ల జేబుల్లోకి లక్షలకు లక్షలకు లక్షలు పోతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అనంత సులువుగా లంచాలు తీసుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. పైగా తమను ఏబిసి అధికారులు కూడా పట్టుకోకుండా రకరకాల రూపాల్లో లంచాలు తీసుకుంటున్నారు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలన్నట్లు, కొత్త కొత్త దారులు వెతుక్కొని మరీ లంచాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్ప్పుకుంటే వ్యవస్ధ ఎంత దిజజారిపోయిందో కూడా తెలుసుకోవచ్చు. ఒక తహసిల్ధార్పై కొంత కాలంగా అనేక పిర్యాధులు ఏసిబికి అందాయి? అలా అందుతున్న పిర్యాధులతో ఏసిబి అదికారులు ఆ తహసిల్ధార్ను పట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చిక్కిన దాఖలాలు లేవు. ఏదో రకంగా ఆ తహసిల్ధార్ తన అతి తెలివితో తప్పించుకుంటూ వచ్చారు. ఆఖరుకు ఏసిబి అధికారులు ఆ తహసిల్ధార్ ఇంటి మీద దాడులు చేస్తారన్న సమచారాన్ని కూడా తెలుసుకొని, నాలుగు కోట్ల రూపాయల విలువైన డబ్బు, నగలతో కూడిన సూట్కేసును రోడ్డు మీద విసిరేశాడంటే? వారి అతి తెలివి తేటలు ఎలా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. రోడ్డు మీద నాలుగు కోట్ల రూపాయలను క్షణం ఆలోచించకుండా విసిరిపడేసేందుకు సిద్దమయ్యాడంటే, అతని సంపాదన బైట ఎంత వుంటుందో అంచనా వేసుకోవచ్చు. అలా విచ్చలవిడిగా కొంత మంది తహసిల్ధార్లు సంపాదిస్తున్నారు. అయితే ఏసిబి అధికారుల్లో కూడా కొంత మంది అక్రమ తహసిల్ధార్లకు కూడా ముందస్తు సమాచారం అందిస్తున్నారన్న సంగతి కూడా తేలిపోతోంది. వ్యవస్ధలు ఇలా అక్రమంగా కుమ్మక్కైతే అవినీతి ఎలా అంతమౌతుంది? లంచాలు లేని వ్యవస్ధ నెలా నిర్మాణమౌతుంది? ఇలా అవినీతి సొమ్ముకు అలవాటు పడిన తహసిల్దార్లు తెలంగాణలో అనేక మంది వున్నారు. వారి బండారం నేటిధాత్రి వరుస కధనాలతో బైట పెట్టనుంది. ఎందుకంటే తరాలు తిన్నా తరగనంత సంపాదన కోసం ఓ వైపు పేదల రక్తం తాగుతున్నారు. మరో వైపు చట్టాలను అమలు చేయాల్సిన కర్తవ్యం గాలికి వదిలేస్తున్నారు. తమ బాధ్యతలను విస్మరించి అక్రమ రియల్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. వారి అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాస్తున్నారు. వారి నుంచి లక్షల రూపాయలు దండుకొని ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. సహజంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ల కాకుండా అడ్డదారిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వాదేశాలను కూడా బేకాతరు చేస్తున్నారు. గుంట కొనుగోలు చేయాలనుకునే వారితో మరో ఐదుగురిని కలిపి ఐదు గుంటలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. పాస్ బుక్కులను కూడ జారీ చేస్తూ రియల్ వ్యాపారులకు సహకరిస్తున్నారు. రియల్ వ్యాపారులు చెప్పే అuద్దాలను నిజమని నమ్మేలా తహసిల్ధార్లు రిజిస్ట్రేషన్లు చేస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. తమకు సంపాదనే ధ్యేయమని నిరూపిస్తున్నారు. అమయక ప్రజలను నిండా ముంచుతున్నారు. అలాంటి వారిపై వరుస కథనాలు రేపటి నుంచి మీ నేటిధాత్రిలో….
`అలాంటి తహసీల్దార్ల అవినీతి బాగోతలపై మీ “నేటిధాత్రి”లో వరుస కథనాలు!
`ఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ లలో ఆ తహసిల్దార్ అవినీతి కిరణాలు? ఎపిసోడ్ 2
