విద్యార్థులకు విజ్ఞానం, వినోదం రెండూ ముఖ్యమే- ఉప్పుల శ్రీనివాస్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి హై స్కూల్ విద్యార్థులు విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ లోని వండర్ లాను ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం రెండూ ముఖ్యమేనని, నిత్యం పుస్తకాలతో కుస్తీపడే విద్యార్థులకు విహారయాత్రలతో కాస్త విరామం పొందుతారన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
