మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

Vishal:నేటి దాత్రి :

 

 

 

 

గ‌త కొంత‌కాలంగా పెండింగ్‌లో ఉన్న న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌పై ఆ సంఘం కార్య‌ద‌ర్శి, హీరో విశాల్‌ స్పందించారు.

నడిగర్‌ సంఘానికి (Nadigar Sangam) ఎన్నికలు నిర్వహిస్తే సంఘ భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే నడిగర్‌ సంఘ సభ్యుల పదవీ కాలం మూడేళ్ళ పాటు పొడిగించినట్టు హీరో, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ (Vishal) మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)కు తెలిపారు. నడిగర్‌ సంఘం బై లా ప్రకారం ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ప్రకారంగా 2022లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్‌, ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, కోశాధికారిగా కార్తి, ఉపాధ్యక్షులుగా పూచ్చి మురుగన్‌, కరుణాస్‌ తదితరులు ఎన్నికయ్యారు. అయితే, వీరి పదవీకాలం గత మార్చితో పూర్తయింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిటీ సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్ళపాటు పొడగిస్తూ 2024, సెప్టెంబరు 8వ తేదీ జరిగిన నడిగర్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నటుడు నంబిరాజర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు (Madras High Court) నడిగర్‌ సంఘానికి నోటీసు జారీ చేసింది. దీంతో విశాల్‌ హైకోర్టులో ఒక అఫడవిట్‌ దాఖలు చేశారు.

‘నడిగర్‌ సంఘ (Nadiga Sangam) భవనాన్ని రూ.25 కోట్లతో నిర్మాణం చేపట్టి 60 శాతం మేరకు పనులు పూర్తి చేశాం. మా పదవీకాలం ముగిసినప్పటికీ 2025-28 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటే భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల ఈ ప్రస్తుత కార్యవర్గాన్ని మరో మూడేళ్ళపాటు పొడిగిస్తూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఈ పిటిషన్‌ దాఖలు వెనుక స్వార్థం ఉంది. అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు తదుపరి విచారణను జూన్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version