ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు…

ఓటమి వచ్చిన ప్రజల వైపే అడుగులు

భాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం,సరుకుల వితరణ కార్యక్రమాలు

ప్రజల కష్టాలలో ముందుంటున్న మాజీ కౌన్సిలర్ రజిని నవీన్

పరకాల,నేటిధాత్రి

 

గెలిచినా ఓడినా ప్రజా సేవే తమ లక్ష్యమని,ప్రజలే తమకు దైవమని పరకాల మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరకాల పట్టణంలోని 17వ వార్డు నుండి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా శనిగరం రజినీ నవీన్ పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క బ్యాలెట్ ఓటుతో ఓడిపోయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా ప్రజల మధ్యనే ఉండి సేవ కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా రజినీ నవీన్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజమని తెలిపారు.ప్రజల కోసం పని చేయడమే తమ అసలు లక్ష్యమని చెప్పారు. ప్రజలు చూపిన ఆదరణ,విశ్వాసం తనకు మరింత బాధ్యతను కలిగించిందని అన్నారు.గతంలో తాము పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని ఆయన తెలిపారు.తమ సేవలను గుర్తించిన ప్రజలు రిజర్వేషన్‌లో భాగంగా 17వ వార్డులో పోటీ చేయాలని కోరడంతో పాటు పార్టీ ఆదేశానుసారం ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు.అయితే ఎన్నికల్లో కేవలం ఒకే ఓటు తేడాతో ఓటమి చెందినప్పటికీ ప్రజలపై ఉన్న నమ్మకం ఏమాత్రం తగ్గలేదని ఆయన అన్నారు.తమకు ఓటు వేసిన వారే కాకుండా ఓటు వేయని ప్రజల కోసం కూడా సమానంగా సేవ చేస్తానని తెలిపారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండటం తన బాధ్యతగా భావిస్తున్నానని వార్డు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఇటీవల 17వ వార్డులో మరణించిన కుటుంబాలను స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా అవసరమైన సహాయం కూడా అందిస్తున్నారు.ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ప్రజల పట్ల చూపుతున్న ఈ స్పందన చర్చనియమైంది.ప్రజా సమస్యల విషయంలో వెంటనే స్పందిస్తూ ప్రజల మధ్య ఉండడం ఆయన నాయకత్వ లక్షణాన్ని చూపిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల్లో ఓటమి వచ్చినప్పటికీ ప్రజా సేవలో వెనుకడుగు వేయకపోవడం అభినందనీయమని వార్డు ప్రజలు చెబుతున్నారు.ప్రజల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మధ్యనే ఉంటానని మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి….

ప్రభుత్వ పథకాలు విజయ వంతం అయ్యేలా కృషి చేయాలి

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి

అభివృద్ధి సమన్వపర్య వేక్షణ కమిటీ (దిశ) సమావేశం

శాయంపేట నేటిధాత్రి:

హన్మకొండలోని కలెక్టర్ కార్యా లయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వ హించిన జిల్లా అభివృద్ధి సమ న్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడి యంకావ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమా వేశంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావుపాల్గొన్నారు.సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురో గతి, ప్రజ లకు అందుతున్న సేవలపై అధికారులు వివరా లు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకుల మరియు ప్రభుత్వ పాఠశాలలో టాయి లెట్స్ అంతర్గతo లేకుండా ,కోతుల బెడద లేకుండా , కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయా లని, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని, అదే విధంగా మండలంలోని గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్య లేకుండా,అభివృద్ధి కార్యక్ర మాలు వేగవంతంగా అమలు చేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత అధికారు లకు తగిన సూచనలు చేశా రు. ఈ సమావేశంలో దిశ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ మేయర్ గుండు సుధారాణి , కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజిపై , జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధు లు మరియు సంబంధిత విభా గాల అధికారులు పాల్గొన్నా రు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version