ఇద్దరు దుర్మార్గులు లాయర్ను తుపాకితో కాల్చి చంపి బైకుపై పారిపోవడానికి చూశారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ అవ్వకుండా హంతకులకు
చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మీర్జాపూర్, ఏప్రిల్ 11: ఇద్దరు దుర్మార్గులు లాయర్ను తుపాకితో కాల్చి చంపి బైకుపై పారిపోవడానికి చూశారు. అయితే, ఆ బైక్ స్టార్ట్ అవ్వకుండా హంతకులకు చుక్కలు చూపించింది. దాదాపు ఓ నిమిషం పాటు సంఘటనా స్థలం నుంచి ముందుకు వెళ్లకుండా ఆపేసింది. ఆ హంతకులు అతి కష్టం మీద బైక్ను స్టార్ట్ చేసుకుని అక్కడినుంచి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. శనివారం ఉదయం మీర్జాపూర్కు చెందిన 45 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ రాజీవ్ సింగ్ మార్నింగ్ వాక్కు వెళ్లాడు.
