జర్నలిస్టుల దీక్షకు డాన్స్ అసోసియేషన్ మద్దతు

జర్నలిస్టులకు మద్దతు తెలిపిన డాన్స్ అసోసియేషన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

గత రెండు సంవత్సరాల క్రితం జర్నలిస్టులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా, ఇప్పటివరకు వారికి అసలు స్థలం చూపించకపోవడం చాలా బాధాకరం. ఈ న్యాయమైన డిమాండ్ కోసం జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి డ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం సమాజంలో నిజాన్ని లేవనెత్తి ప్రజల ముందు ఉంచేవారు మీరు.
ఎవరూ మాట్లాడలేని నిజాన్ని మీరు వెలుగులోకి తీసుకువస్తారు. రాత్రింబవళ్లు కష్టపడేది వార్త కోసం కాదు — సమాజంలో మార్పు కోసం. మీలాంటి గొప్ప వృత్తి ప్రతినిధులు ఇలాంటి సమస్యలతో నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.
మా డాన్స్ యూనియన్ మేమంతా మీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాము. మీ డిమాండ్ న్యాయమైనది, ప్రభుత్వం అధికారులు వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని స్పష్టంగా చూపించాలని మా యూనియన్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో
జయశంకర్ జిల్లా డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ తోటకూరి గణేష్
దుర్గం రమేష్ గౌరవ అధ్యక్షులుడాన్స్ మాస్టర్
దుట తిరుపతి జాయింట్ సెక్రెటరీ
చాగర్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version