టీజీ ఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్.

టీజీ ఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్

జైపూర్ నేటి ధాత్రి:

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ), మంచిర్యాల రేంజ్ లోని జైపూర్ సిరీస్ లో పనిచేస్తున్న ఎ.సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు.టీజీ ఎఫ్ డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డివిజన్ ల వారీగా ప్రకటించిన జాబితాలో ఇక్కడి కాగజ్ నగర్ డివిజన్ లోని మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ ఎంపికయ్యారు. గత 10 సంవత్సరాలుగా ప్లాంటేషన్ లను రక్షిస్తూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నందుకు గాను ఈ అవార్డు ప్రకటించారు.ఈ సందర్బంగా శుక్రవారం రాత్రి డివిజన్ కేంద్రమైన కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమం లో డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా సాయికిరణ్ ప్రశంసా పత్రం తో పాటు 5000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు.ఈ సందర్బంగా టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు రేంజ్ సిబ్బంది సాయికిరణ్ ను అభిందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version