ఇఫ్తార్ విందు: మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ పట్టణంలోని బీదర్ బేస్ ప్రధాన కూడలిలో ప్రముఖ వ్యాపారవేత్త ముక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. విందు అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తాయని ముస్లిం మత పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాచూరి కనకరత్నం, రాచురి చంద్రశేఖర్, బడంపేట శ్రీనివాస్, రాజేశ్వర్, చాంద్ ఖురేషి, మునవర్ పటేల్, శన్ను, వెంకటేశం, రాధాకృష్ణ, అశోక్ తివారీ, సంగయ్య, వీరారెడ్డి, హాజి సేట్, సర్దార్ సెట్, ముక్రం, అజర్ సెట్, మాన్యయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగింది.
