ఉచిత ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

చిమిర్యాల సర్పంచ్ కొత్త గురవయ్య

కోదాడ, నేటి ధాత్రి:

 

ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు ముఖ్యంగా నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోదాడ మండల గ్రామ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, చిమ్మిరాల గ్రామపంచాయతీ సర్పంచ్ కొత్త గురువయ్య అన్నారు. మంగళవారం గ్రామములోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ. మంగలతండా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వైద్య సిబ్బంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారని అలాగే ఆపరేషన్ అవసరం ఉన్న రోగులకు సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ లో ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సూర్యాపేట ఏరియల్ హాస్పిటల్ వైద్యులకు వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బండ్ల సైదులు,గ్రామ కార్యదర్శి వీరబాబు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణలో పెట్రోకార్,బ్లూ కోల్ట్ వాహనాల కీలక పాత్ర

నేరాల నియంత్రణలో పెట్రోకార్,బ్లూ కోల్ట్ వాహనాల కీలక పాత్ర

పోలీస్ వాహనాల కోసం నూతనంగా నిర్మించిన షెడ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే.

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ వాహనాల పార్కింగ్ మరియు సంరక్షణ కోసం నూతనంగా నిర్మించిన షెడ్‌ను జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి ప్రారంభించరు.
అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల కు కేటాయించిన పెట్రోకార్ వాహనాలను తనిఖీ చేసి వాహనాల నిర్వహణపై ఆరా తీసారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతు …జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా నేర సమాచారం అందిన వెంటనే పోలీస్ బృందాలు బ్లూ కోల్ట్ మరియు పెట్రోకారు ద్వారా చేరుకొని క్షేత్ర స్థాయిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాయన్నారు. ప్రజలకు తలెత్తుతున్న సమస్యలకు తక్షణమే స్పందించి సత్వర సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీస్ శాక నుండి కేటాయించబడిన పెట్రోకార్ ,బ్లూ కోల్ట్ వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యెక జాగ్రతలు తీసుకోవాలన్నారు.

వాహనల డ్రైవర్లు వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్ లో ఉండేలా చూసుకోవాలని అప్పుడే ఘటన స్థలానికి సకాలంలో చేరే అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం అధికరులతో ఎస్పీ కలసి వాహనాల షెడ్ ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు,సి.ఐ లు ఆర్.ఐ లు వాహనాల డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version