అయినవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరం

అయినవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరం
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు

నేటి ధాత్రి అయినవోలు:-

 

 

 

అయినవోలు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రజా పాలన ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఏవైనా అవసరాలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం ద్వారా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బొల్లపెల్లి మధు, అయినవోలు గ్రామ ఉపసర్పంచ్ బరిగల భాస్కర్, వార్డ్ సభ్యులు రాజేందర్, నల్లబెట్టి రాజు, అయినవోలు మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కొత్తూరు కుమార్ స్వామి, రాంనగర్ రాజేష్ రెడ్డి, అయినవోలు మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కొండేటి దిలీప్, అయినవోలు గ్రామ యూత్ ప్రెసిడెంట్ తాటికాయల ప్రశాంత్, కోట నర్సయ్య, అయినవోలు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోల్లపల్లి పరమేష్ గౌడ్, బోల్లపల్లి శ్రీను గౌడ్, బోల్లపల్లి రఘు, సంపత్, చింత ఏలీయా తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version