దేవీ నవరాత్రి ప్రత్యేక పూజల పట్టు వస్త్రాలు కలుశాన్ని సమ్మి గౌడ్ కి అందజేత…

దేవీ నవరాత్రి ప్రత్యేక పూజల పట్టు వస్త్రాలు కలుశాన్ని సమ్మి గౌడ్ కి అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా భవాని మాతా దేవి ప్రత్యేక పూజల్లో తొమ్మిది రోజులపాటు ఉన్నటువంటి కలుశాన్ని,ప్రతిరోజు అమ్మవారి అలంకరణలో భాగంగా ఉన్న పట్టు వస్త్రాలను తాళ్లపూస పల్లి అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ యువత సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ కి అందజేశారు.ఈ సందర్భంగా
సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, ఆ దుర్గామాత తల్లి పూజలతో వర్ధిల్లిన పట్టు వస్త్రాలు,కలుశం అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీకి, నాకు అందేలా చేసిన దుర్గామాతకు, అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్,రాజు, మధుకర్,నరేందర్, విక్రమ్,శివరామకృష్ణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version