హకింపేట్ డిపోలో ఆర్టీసీ జెఏసి పోస్టర్ ఆవిష్కరణ…

హకింపేట్ డిపోలో ఆర్టీసీ జెఏసి పోస్టర్ ఆవిష్కరణ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ రీజియన్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గోపు శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఆర్టీసీ హకింపేట్ డిపోలో బుధవారం ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై 24 ఫిబ్రవరి చలో సెక్రట్రియేట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే ఆర్టీసీ సత్తా చాటి ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నామల కృష్ణ, నాగరాజు, రమేష్, గ్యారేజ్ సెక్రటరీ రఘు, రాంచందర్, సుజిత్, మౌలానా రాజేందర్, పద్మ, సింధు, నాగమణి, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, సరిత ఉద్యోగులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version