రద్దు చేసినా… సస్పెన్షన్ తిప్పలు తప్పకపోయిన సబ్ రిజిస్ట్రార్..

రద్దు చేసినా… సస్పెన్షన్ తిప్పలు తప్పకపోయిన సబ్ రిజిస్ట్రార్

కొత్తపల్లి హవెలి సర్వే నం. 272/14 రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై చర్య

గంగాధర నేటిధాత్రి :

ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై దర్యాప్తులో భాగంగా గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫ్జల్ నూర్ ఖాన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి హవెలిలో సర్వే నంబర్ 272/14కి సంబంధించిన భూమిపై గతంలో తొమ్మిది రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికార విచారణలో తేలింది.
అయితే, ఆఫ్జల్ నూర్ ఖాన్ ఈ రిజిస్ట్రేషన్లను స్వయంగా గుర్తించి, సంబంధిత క్రయ విక్రయ దారులను పిలిపించి డాక్యుమెంట్లను రద్దు చేసినప్పటికీ, అధికార విరుద్ధ చర్యల కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ భూమి గవర్నమెంట్ భూమి పరిధిలోకి వస్తుందన్న కారణంతో ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ & స్టాంపులశాఖ ఐజీ ఆదేశాలతో కరీంనగర్ డీఐజీ ఎం. రవీందర్ సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫ్జల్ నూర్ ఖాన్ భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో అధికారుల చర్యలు ప్రాధాన్యత పొందినట్టు తెలుస్తోంది.

కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..

*కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..

*గిరిజనులను హేళనగా మాట్లాడిన హీరోను అడ్డుకుంటాం..

*నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్..

తిరుపతి(నేటి ధాత్రి(;జూలై 25:

విజయదేవర కొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ కు తిరుపతిలో అనుమతి రద్దు చేయాలని నిఘా నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ నగర పాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన హిరో సూర్య రెట్రో చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు హీరో విజయదేవకొండ హాజరయ్యారని, ఈవెంట్ కార్యక్రమంలో అభిమానుల తోపులాటను గుర్తించిన విజయదేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్లు అభిమానులు కొట్టుకుంటున్నారని హేళన చేసి మాట్లాడడం దారుణమన్నారు. వివక్షత లేని సమాజం సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన హీరో ఒక జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవల ఫల్మాం సంఘటనలో దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మురళీ నాయక్ మా జాతి బిడ్డ అని గర్వంగా చెప్పారు. అలాంటి గిరిజన జాతిని హేళనగా మాట్లాడిన దేవరకొండ సినిమా కింగ్డమ్ చిత్రం ఈవెంట్ను తిరుపతిలో అడ్డుకుంటామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో నేతలు రవీంద్రనాయక్, శివశంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version