ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేస్తున్న జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేస్తూ నివాళులర్పిస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ బొడ్డు స్మరణ.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు హాజరై మాట్లాడుతూ. భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేసారు అనంతరం వారు మాట్లాడుతూ
ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు కూడా భగత్ సింగ్ పూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు.. దేశం స్వాతంత్ర కోసం పోరాటం చేసినటువంటి. స్వాతంత్ర సమరయోధుడు అని కొనియాడారు.. కామ్రేడ్ భగత్ సింగ్ అతి చిన్న వయసు నుంచి దేశభక్తి కలిగిన వాడు అని సందర్భంగా అన్నారు.. స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ఉరి కొయ్యలను సైతం ముద్దాడినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ ఈ దేశంలోని పౌరులందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు …
