పరకాల పట్టణంలో పోలీస్ కవాతు.

పరకాల పట్టణంలో పోలీస్ కవాతు

భద్రత భావాన్ని ప్రజల్లో నింపడానికే ఈ కార్యక్రమం

పరకాల ఏసీపీ సతీష్ బాబు

పరకాల నేటిధాత్రి

 

 

సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం రోజున రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు నిర్వహించారు.ఈ కావాతును పాత సీఎంఎస్ గోదాం వద్ద ఏసీపీ సతీష్ బాబు ప్రారంభించారు.పట్టణంలోని అంబేద్కర్ కూడలి నుండి డిపో సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు సాగింది.ఈ సందర్భంగా పరకాల ఎసిపి మాట్లాడుతూ తాము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి పరకాల సిఐ క్రాంతికుమార్,శాయంపేట సీఐ పి.రంజిత్ రావు,ఆత్మకూరు సీఐ ఆర్.సంతోష్,పరకాల ఎస్సైలు శివకుమార్,రమేష్,శాయంపేట ఎస్ఐ.పరమేష్,దామెరా ఎస్ఐ అశోక్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version