టీఎన్జీఓ డైరీ 2026 ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ & టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు బూరుగు రవి కుమార్ ఆధ్వర్యములో మంగళవారం జిల్లా ఐడిఓసి కార్యాలయములో టీఎన్జీవో డైరీ 2026 ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించినారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమనికి పాటుపడుతానని టిఎన్జీవో మీటింగ్ హాల్ నిర్మాణానికి ఆర్ధిక సహాయము చేస్తానని హామీ ఇవ్వడము జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు సీఎంటీ విజయలక్ష్మి అశోక్ కుమార్ పాల్గొన్నారు ఈ సమావేశం నకు జిల్లా కార్యదర్శి ఏ. దశరథ రామ రావు, కేంద్ర సంగం ఉపాధ్యక్ష-కార్యదర్శి షఫీ అహ్మద్,గ్యానేశ్వర్ సింగ్, అసోసియేట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కోశాధికారి అన్వార్ భైగ్ జిల్లా భాద్యులు వంశీ కృష్ణ, మురళీధర్ రెడ్డి,సత్యనారాయణ, శ్రీదేవి, జామలుద్దీన్, స్వప్న, సాంబాశివా రావు, అరుణ్, రేణుక, రెవిన్యూ పక్షాన అసిఫ్, అబ్బాస్, అప్రూస్, అనురాధ, నర్సింగ్ ఆఫీసర్స్ పక్షాన జన్ను కుమార్, రాణి, రాజు, సురేష్, శ్యామల, స్వర్ణ, అనురాధ, మెడికల్ పక్షాన దినేష్, రవీందర్ రెడ్డి, విజయ, సమిత, శ్రీధర్ రెడ్డి, పద్మ మొదలగు వారు పాల్గొన్నారు.
