ఎండలు మండుతున్నాయి……
అప్రమత్తంగా ఉండండి మొగుళ్లపల్లి ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రోజు రోజుకు ఎండలు మండుతున్నవి ఉదయం పది గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడని వడదెబ్బ తగలకుండా ప్రజలప్తమతంగా ఉండాలని మొగుళ్లపల్లి ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు అన్నారు ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ ధరించి రుమాలు ధరించి వెళ్లాలని సరిపోయినంతగా త్రాగునీరు నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాలు వంటి తరచూ తీసుకుంటూ ఉండాలని తెలిపారు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు పనులను వెళ్లేవారు రోడ్డు ప్రక్కన వ్యాపారాలు నిర్వహించేవారు ఎండల ప్రవాహం నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు వృద్ధులు చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఎండ తీవ్రత తగ్గే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలనిఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు కోరారు నిరంతరం అనేక గ్రామాల నుండి వచ్చే వారికి ప్రయాణికులకు శుక్రవారం సంత కు వచ్చే వారికి దాహం తీర్చే ందుకు మొగుళ్లపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఉపసర్పంచ్ తెలిపారు
