నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న.!

నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కే సముద్రం విలేజ్లో విశ్వబ్రాహ్మణ సంఘం నూతనంగా నిర్మించబోతున్న శ్రీ శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల నూతన దేవాలయములకు గాను గురువారం భూమి పూజ శిలా న్యాస శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొనడం జరిగింది, వారితోపాటు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, దస్రు నాయక్, శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మురళి నాయక్ ను శాలువాతో సత్కరించడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు మరియు కమిటీ సభ్యులను అభినందించారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేయాలంటే చాలా కష్టతరమైన కార్యచరణ ఎంతో కష్టంతో కూడుకున్న కార్యక్రమం చేపట్టారు అని మీరంతా సమైక్యంగా ఉండి ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని అప్పుడే అనుకున్న కార్యచరణ సిద్ధిస్తుందని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సంకేపల్లి నారాయణరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, లక్కాకుల నరసయ్య, బుర్ర నాగిరెడ్డి, కమటం సురయ్య, కనుకుల రాంబాబు, మరియు విశ్వబ్రాహ్మణ సంగం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version