పరకాలలో మూగబోయిన చికెన్ షాపులు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో ఒకప్పుడు రద్దీగా ఉండే చికెన్ షాపులు ప్రస్తుతం నిశ్శబ్దంగా మారుతున్నాయి.రోజువారీగా కస్టమర్లతో కిటకిటలాడే ఈ వ్యాపారాలు ఇప్పుడు తగ్గిన అమ్మకాలతో మందగమనం లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది.
పట్టణంలో చికెన్ అమ్మకాలు ఇటీవల గణనీయంగా తగ్గినట్లు గమనించవచ్చు. కోళ్ల కొనుగోలు ధరలు పెరగడం వల్ల వ్యాపారంపై ప్రభావం పడినట్లు భావిస్తున్నారు.కొనుగోలు ధరలు అధికంగా ఉండటంతో వినియోగదారులకు కూడా ఎక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుండగా,దీనివల్ల కొనుగోలు దారులు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది.దసరా సమయం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు స్థానికంగా చెబుతున్నారు.ఖర్చులు పెరగడం,అమ్మకాలు తగ్గడం వంటి కారణాలతో చికెన్ వ్యాపారం మందగమనం లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.కొన్ని షాపులు తాత్కాలికంగా మూసివేయబడినట్లు కనిపించగా,మరికొన్ని షాపులు పరిమిత స్థాయిలోనే కొనసాగుతున్నాయి.మొత్తం మీద కొనుగోలు దారులు తగ్గిపోవడం,మార్జిన్ తగ్గడం వంటి అంశాలు చికెన్ వ్యాపారంపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.
