సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం…

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా గాంధీనగర్ హనుమాన్ దేవస్థానంలో సి.సా.స గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళీధర్, అధ్యక్షులు జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నేరోజు రమేష్, మరియు మానేరు స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు చింతోజు భాస్కర్ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగినది. ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ అతిధులుగా చైర్మన్ కళా చక్రపాణి, విశిష్ట అతిథులుగా డి.ఎస్.పి కట్రోజు నాగేంద్ర చారి ఆధ్వర్యంలో కవిసమ్మేళనంతో పాటు కవులకు ఉగాది పురస్కారాలు అందించడం జరిగింది అంతోపాటు ఈ సందర్భంగా డి.ఎస్.పి నాగేంద్ర చారి మాట్లాడుతూ… కలం పట్టిన వీరులు కవులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఒక సైనికుడిలా ఎదిరించి నిద్రపోతున్న సమాజాన్ని లేపే వ్యక్తులే కవులని కళాకారులు రచయితలని అన్నారు.
అంతేకాకుండా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్ల సాహితీ సమితికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కవులకు ఆదరణగా ముందుకు సాగుతూ ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అంకారపు జ్ఞానోబా, గడ్డం పరశురాములు, గోష్కొండ మురారి, ముడారి సాయి మహేష్, ఆడేపు లక్ష్మణ్, అంజనా దేవి, యువ కవులు రచయితలు, అంకారపు రవి, దూడం గణేష్,గుండెల్లి వంశీ,ఈడేపు సౌమ్య, తదితర కవులు రచయితలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version