శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ
మందమర్రి నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రిలో శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ….. మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్రిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయం గ్రామ ప్రజలందరి సహకారంతో పునర్ నిర్మింపబడి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహా కుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల రామ్మోహన్రావు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవాధ్యక్షులు రామ్మోహన్రావు మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ ఊరు మందమరిలో 60 ఏళ్ల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొని తిరిగి పూర్వ వైభవంతో ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కల్యాణ మహోత్సవాలు మహాకుంభ అభిషేకం యజ్ఞాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఐదు రోజుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రాఘవేంద్రరావు అధ్యక్షులు పెద్ద లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి ఉప్పలోష శంకర్ లింగం కోశాధికారి పెద్ద సత్తయ్య లింగం రాజయ్య చంద్రయ్య నాగోల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు