పిక్చర్ అబీ బాకీ హై
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులపై ఫైట్లో పైచేయి సాధించామంటూ గులాబీ పార్టీ ఖుష్ అవుతోంది. సర్కార్ మాత్రం పిక్చర్ అబీ బాకీ హై అంటూ స్టేట్మెంట్లు ఇస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా తనను విచారణకు పిలిచే అధికారం జస్టిస్ నరసింహారెడ్డికి లేదంటూ కేసీఆర్ ఇచ్చిన రిప్లై అప్పట్లో చర్చకు దారితీసింది. ఈ విచారణ చట్ట విరుద్ధమని, రాజకీయ కక్షతో ఏర్పాటు చేశారని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై కూడా హైకోర్టుకెళ్లి మరీ ఆర్డర్స్ తెచ్చుకుంది బీఆర్ఎస్. అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి కారు పార్టీని ఈ రెండు ఇష్యూస్లో ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు తాము చేసిన పోరాటం ఫలించిందని..గులాబీ దళం హ్యాపీగా ఫీల్ అవుతోంది. రేవంత్ది రాజకీయ కక్ష సాధింపు చర్యగా రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ రెండు ఇష్యూస్కు ఇంతటితో ఎండ్కార్డ్ పడ్డట్లేనా? వచ్చే ఎన్నికల వరకు కాళేశ్వరం చుట్టే రచ్చ జరగబోతోందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్గానే ఉంది.
