టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో రేగిన మంటలు..

 టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో రేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

 

బ్రెజిల్‌లో లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగడం కలకలానికి దారి తీసింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 180 మంది ప్రయాణికులు ఉన్న విమానం రన్‌వే పైకి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం శావొ పావొలో నగరంలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది (LATAM Airlines Flight Catches Fire).స్థానిక మీడియా కథనాల ప్రకారం, లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం టాక్సీయింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈలోపు అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version