బరిలోకి విద్యావంతురాలు…రాయికోటి వినోద…!
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామపంచాయతీ సర్పంచి బరిలో ఉన్నత విద్యావంతురాలు రాయికోటి వినోద నిలిచారు. ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం కి చెందిన, రాయికోటి బల్ రాజ్ ఆమె వివాహమాడారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఝరాసంగం గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో గ్రామస్తుల సహకా రంతో సర్పంచి బరిలో నిలిచింది. విద్యావంతురాలు అయిన తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
