రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు…

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను.. ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

 రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనకు, ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల ఈడీ జారీ చేసిన సమన్లకు అనిల్ అంబానీ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకు రెండోసారి నోటీసులు పంపారు. ఆయన సతీమణి టీనా అంబానీని కూడా ఈడీ విచారించాల్సి ఉంది. అయితే ఆమె కూడా గతంలో రెండుసార్లు విచారణకు హాజరు కాలేదు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అంబానీ కుటుంబంపై ఈ విచారణ కొనసాగుతోంది. విదేశాల్లోని వారి ఆస్తులు, లావాదేవీల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

కాగా, ఈనెల 26న అనిల్ అంబానీ విచారణకు హాజరవుతారా, లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరుసగా విచారణకు గైర్హాజరు కావడం వల్ల భవిష్యత్తులో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version