భూసేకరణ బాధితులకు సహాయం చేయండి…

భూసేకరణ బాధితులకు సహాయం చేయండి…

◆”-: భూ బాధితులు సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్యకు ఫిర్యాదు

జహీరాబాద్, నేటి ధాత్రి:

 

భూసేకరణ పరిహారాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి – సంగారెడ్డి జిల్లా, ఝరసంగం మండలం, ఎల్లోయ్ గ్రామ నివాసులు. నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం సర్వే నంబర్లు 54 మరియు 125లోని మా భూమిని సేకరించారు. అయితే, మా భూములకు నష్టపరిహారం చెల్లించడం లేదు. మొత్తం 8 మంది పట్టాదారులు ఉన్నారు. మా వద్ద అసైన్‌మెంట్ కమిటీ జారీ చేసిన పట్టా సర్టిఫికేట్లు ఉన్నాయి. మేము దీని గురించి డిప్యూటీ కలెక్టర్‌ను అడిగినప్పుడు, ఆ భూమి మా ఆధీనంలో లేదని అప్పటి ఆందోలే ఎంఆర్‌ఓ రాశారని వారు చెప్పారు. ఝరసంగం మండలంలోని ఎల్లోయ్ గ్రామం గురించి ఆందోల్ ఎంఆర్ఓకు ఏమి తెలుసు? అందువల్ల, ఈ గ్రామంలోని 54 మరియు 125 సర్వే నంబర్లలో ఎంత మందికి పట్టాలు ఇచ్చారో మరియు ఎంత మంది అర్హులకు నిరాకరించారో దయచేసి విచారణ జరపండి. దీనిపై విచారణ జరిపి, నిజమైన పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే నకిలీ పట్టాదారులకు నష్టపరిహారం ఇచ్చిన అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని వారు కోరారు. 8 మంది పట్టాదారులకు నష్టపరిహారం విడుదల చేయాలని మా విన్నపం. అధికారులు దీనిని ఉద్దేశపూర్వకంగా 9 సంవత్సరాలుగా ఆలస్యం చేస్తున్నారు, ఈ విషయంపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని వారు ఉన్నతాధికారులను కోరారు.

ఐటీ పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం…

ఐటీ పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం

న్యాయం చేయాలని కలెక్టర్‌ ను ఆశ్రయించిన బాధితుడు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఐటీ పార్క్ భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత రైతు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.తనకి వాస్తవంగా (నక్ష ప్రకారం) ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నప్పటికీ,అధికారుల నిర్లక్ష్యంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు.వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 159/37లో తన కుటుంబం సంవత్సరాలుగా నిరంతరంగా భూమిని సాగు చేస్తోందని,వాస్తవ స్వాధీనంలో ఉన్న మొత్తం విస్తీర్ణం 5 ఎకరాలు 02 గుంటలుగా ఉందని ఆయన పేర్కొన్నారు.అయితే పాస్‌బుక్‌లో ఒక్క ఎకరం 01 గుంట మాత్రమే నమోదై ఉండటాన్ని కారణంగా చూపి,మిగతా భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు.భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని,గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు.కేవలం పత్రిక ప్రకటనకే పరిమితం కావడంతో అభ్యంతరాలు తెలిపే అవకాశం కోల్పోయామని పేర్కొన్నారు.అలాగే ప్రాథమిక విచారణ నివేదికలో కూడా వాస్తవ స్థితిని పక్కనపెట్టి,యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని వివరించారు.ఇదే భూసేకరణలో తమలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర రైతులకు నక్ష ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించగా,తన విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆయన వాపోయారు.భూసేకరణ ‘కాన్సెంట్ అవార్డు’ పేరిట జరిగిందని చెబుతున్నా తన నుంచి స్వచ్ఛంద సమ్మతి తీసుకోలేదని,ఒత్తిడితో సంతకాలు సేకరించారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో మిగిలిన భూమికి కూడా నక్షా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని లేదా స్పష్టమైన కారణాలతో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.జిల్లా స్థాయిలో స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version