టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..

టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ..

 

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడంపై ఈడీ విచారణ చేపట్టనుంది..

తిరుమల, ఫిబ్రవరి 10: శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ కేసులో భారీ ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్లు సిట్ విచారణలో తేలడంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో వందలాది కోట్లు చేతులు మారడంపై ఈడీ విచారణ జరపనుంది. అలాగే, మనీ ట్రయల్‌పైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టిసారించనున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version