ఆగిఉన్న కారు దూసుకొచ్చి పలువురికి గాయాలు…

ఆగిఉన్న కారు దూసుకొచ్చి పలువురికి గాయాలు

* ప్రమాదంలో ముగ్గురికి కాళ్ళు విరిగి,
మరో ఇద్దరికీ వెన్నెముకకు గాయాలయ్యాయి
* క్షతగాత్రులను పరామర్శించిన దేవర సమతారెడ్డి
, ఆగిరెడ్డి, మంగలి బాల్ రాజ్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఆగిఉన్న కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి వ్యక్తులపైకి దూసుకొచ్చి
పలువురికి తీవ్ర గాయాలయిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పట్టణకేంద్రంలో చోటుచేసుకుంది. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 17వ వార్డులోని రంగారెడ్డి కాలనీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో పాల్గొన్న వార్డు ప్రజలు , ప్రచారం ముగించుకుని సీపీఐ కాలనీలో ఏర్పాటుచేసిన టెంటు వద్ద బోజనాలు చేసేందుకు వచ్చి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు సేద తీరుతున్నారు. అదే సమయంలో హైద్రాబాద్ కు చెందిన TS 09FW0024 (మహీంద్రా థార్) కారు
వ్యక్తి రెవెన్యూ కార్యాలయానికి భూమి రిజిస్ట్రేషన్ కు వచ్చి జనాలకు దగ్గరగా హడావుడిగా కారును నిలిపి వెళ్లిపోయారు. కంగారులో హ్యాండ్ బ్రేక్ వేయటం మర్చిపోవటంతో కారు నెమ్మదిగా కదులుతూ పక్కనే భగత్ సింగ్ కాలనీకి చెందిన ఒడ్డె జంగమ్మ, మంగలి సరస్వతి, గుండాల మంగమ్మ, సన్నాయిల జయమ్మ, ఒడ్డె రాములమ్మ (70)లపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒడ్డె జంగమ్మ (60) మంగలి సరస్వతి (26)గుండాల మంగమ్మ (60) కు కాలు విరిగాయి. రాములమ్మ, జయమ్మ (62) లకు నడుముకు,వెన్నుకకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి త్వరలించారు.

• క్షతగాత్రులను పరామర్శించిన దేవర సమతారెడ్డి

చేవెళ్లలో జరిగిన కారు ప్రమాదం ఘటన తెలుసుకున్న చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి దేవర సమతా వెంకట్ రెడ్డి, చేవెళ్ల పిసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, బండారి ఆగిరెడ్డి, మాజీ ఎంపిపి మంగలి బాల్ రాజ్, విషయం తెలియగానే హుటా హుటిన ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి గాయపడిన వారిని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో మంగలి యాదగిరి, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ గంగి యాదయ్య, 17 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మూడవత్ క్రిష్ణ నాయక్, నాయకులు అతేల్లి రవీందర్ రెడ్డి, బేగరి శ్రీనివాస్,పలువురు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version