జనశక్తి పేరుతో బెదిరింపులు: ముఠా సభ్యుడు అరెస్ట్

*జనశక్తి పేరుతో బెదిరింపులు*

*డబ్బులు వసూలు చేసే ముఠా సభ్యుడు అరెస్ట్,రిమాండ్. .*

*ఒక కంట్రిమేడ్ పిస్టోల్,ఒక ఎక్సట్రా మ్యాక్జిన్,08 రౌండ్లు స్వాధీనం.*

*వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి.*

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

జనశక్తి పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ
డబ్బులు వసూలు చేసే ముఠా సభ్యుడు అరెస్ట్,రిమాండ్ చేశారని సిరిసిల్ల పోలీసులు తెలిపారు.
ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…
జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్న నలుగురు నింధితులను (తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, వంజరి సురేందర్ @ విశ్వనాథ్ @ బాదం సూర్య ప్రకాష్ రెడ్డి,పయ్యావుల గోవర్ధన్) లను ఈనెల 07 వతేదీన అరెస్ట్ చేసి 9ఎమ్.ఎమ్ పిస్టల్ స్వాధీనం చేసుకొని రిమాండ్ చేయడం జరిగింది.
అట్టి కేసు దర్యాప్తులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్ముడ్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సుధాపల్లి సుధాకర్ తండ్రి బాజన్న, వయస్సు 50 సంవత్సరాలు, ముస్తాబద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామానికి చెందిన బోయిని దేవరాజు తండ్రి అగయ్య,వయసు 49 సం,నల్లగోండ జిల్లా మండలం ఉట్కూర్ గ్రామం శాలి గౌరారం మండలం చెందిన దుబ్బ మధు తండ్రి అంజయ్య, వయస్సు 30 అను వారు పై నలుగురు నిందుతులతో సంబంధం పెట్టుకొని జనశక్తి పేరుతో డబ్బున్న వ్యక్తులను బెదిరింపుల గురి చేసి డబ్బులు వసూలు చేయడం,రియల్ ఎస్టేట్, భూమి వివాదంలో జోక్యం చేసుకొని వారిని బెదిరించడం ద్వారా డబ్బులు అధికంగా సంపాదించవచ్చని ప్లాన్ వేసుకోగా సూడపెళ్లి సుధాకర్,బోయిని దేవరాజు ను ఈనెల 09 తేదీన అదుపులోకి తీసుకిని రిమాండ్ చేయడం జరిగిందని,దుబ్బా మధును ముస్తాబద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతని వద్ద ఒక కంట్రిమేడ్ పిస్టోల్,ఒక ఎక్సట్రా మ్యాక్జిన్, 08 రౌండ్లు స్వాధీనం చేసుకుని ఈరోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.
ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు.

డిఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, తంగలపల్లి ఎస్.ఐ ఉపేంద్రచారి, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version