హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

 

చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21: దేశవ్యాప్తంగా ఉగ్రముప్పు అంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశరాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు సమాచారం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్ర చేసినట్లు సమాచారం. నిఘావర్గాల హెచ్చరికతో ముసారంబాగ్‌, సైదాబాద్‌, మలక్‌పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘాపెట్టారు. ప్రముఖ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version