వేసవిలో తాగునీటి సమస్యపై బోర్ మరమ్మత్తుల చర్యలు
సర్పంచ్ ఎలకపల్లి రమేష్
గణపురం మండలం అప్పయ్య పల్లి లో వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలోని ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి వహించి చర్యలు చేపట్టామని సర్పంచ్ అన్నారు. మంచినీటి బోర్ మరమ్మత్తులు చేసి గ్రామస్తులకుతాగునీటి కోసం ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎండాకాలం మంచినీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మంచినీటి బోరును మరమ్మత్తులు చేపట్టామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
