ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టా పన
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలంలో గల
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు మాట్లాడుతూ 1995 వ సంవత్సరంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యం లో మూడు లక్షల సొంత రూపాయలతో బస్టాండ్ నిర్మించిచామని 2020,21, 22,23 వ సంవత్సరంలో రోడ్డు వెడల్పు భాగంగా బస్టాండ్ ను తొలగించాలని అప్పటి అధికా రులు,ఎమ్మెల్యేను వేడుకొన్నా రు.మేం భవిష్యత్తులో ఈస్థలం లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహా ఆవిష్కరణ చేసుకుంటామని చెప్పడంతో మీకు అనుమతి ఇప్పించే బాధ్యత మాదే అని ఒప్పు కున్నారు.దానిలో భాగంగానే బస్టాండ్ తొలగించామని అన్నారు.అట్టి స్థలంలో ఇతరు లకు ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వకూ డదు అని ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కొరకు వినతి పత్రం అంద జేశారు ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు పత్తి శీను, బూర లక్ష్మీనారాయణ, తుమ్మ ప్రభాకర్, మామిడి మారుతి,
గొట్టిముక్కుల రమేష్,బత్తుల శ్రీధర్, బాసని లక్షణామూర్తి, తదితరులు పాల్గొన్నారు