సమాచారం అడిగితే కక్ష సాధింపు చర్యలా.

సమాచారం అడిగితే కక్ష సాధింపు చర్యలా…?

సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రిటైర్డ్ ఉద్యోగి తన ఆవేదన

వీణవంక, ( కరీంనగర్ జిల్లా ) నేటి ధాత్రి :

 

 

నేటి ధాత్రి :వీణవంక మండల పరిధిలోని చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 23 మంది వివిధ రకాల వాణిజ్య, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న విషయంపై సమాచార హక్కు చట్టం కింద అదే ప్రాంతానికి చెందిన ముదిగంటి రఘునాథ్ రెడ్డి గ్రామం ఇప్పలపల్లి, 86 సంవత్సరాల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సమాచారం కోరినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో సమస్యను హైదారాబాద్ ప్రజా దర్బార్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఏట్టకేలకు స్పందించిన అధికారులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో పవన్ సమక్షంలో ఈ నెల 3న విచారణ చేపట్టగా.. ఆ సమయంలో తనపై దుకాణ సముదాయ ఏర్పాటు చేసుకున్న పలువురు దుర్భాషలాడినట్లు ఆరోపించారు. తక్షణమే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి విషయంపై వీణవంక పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10న, కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ కి ఈ నెల 13న సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు మోతుకు కోమాల్ రెడ్డి, గడ్డం నారాయణ, కళ్యాణ్ ల నుండి బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారి నుండి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version