నేత కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం.

నేత కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం

బత్తుల విఠల్ కుటుంబాన్ని
ఈ ప్రభుత్వం ఆదుకోవాలని

బీ ఆర్టి యు జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుడు బత్తుల విఠల్ అనే వ్యక్తి ఆత్మహత్య పాల్పడడం జరిగినది.
ఈ ఘటనకు సంబంధించి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ..
మాది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పిస్తామని గొప్పలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. సిరిసిల్లలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్లకు వచ్చి కూడా నేతన్నల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నేతన్నలకు నిరంతర ఉపాధితో పాటు వారి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు అండగా నిలిచి నేతన్నలకు మనోదైర్యం కల్పించిన గొప్ప మనసున్న నాయకులు కెసిఆర్. కేటీఆర్ నని అన్నారు. ఆకలి చావులు ఆత్మహత్యలు లేకుండా చేసిన ఘనత కెసిఆర్, కేటీఆర్ దేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి మెరుగైన కూలి వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఆత్మహత్యలు లేకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బత్తుల విఠల్ కుటుంబాన్ని పరిమర్శించి వారి కుటుంబానికి బి.ఆర్.యస్ పార్టీ అండగా ఉంటుందని తెలుపడం జరిగింది.వీరివెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దూస వినయ్. బి.ఆర్.యస్ సీనియర్ నాయకులు బత్తుల రమేష్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version