నల్ల బెల్లం, పటిక పట్టివేత –

నల్ల బెల్లం, పటిక పట్టివేత –

హన్మకొండ సిఐ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

 

గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ పోలీసులు బస్టాండ్ ఆవరణలో నిందితుడిని అదుపులోకి తీసుకొవడం జరిగింది. గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే వ్యక్తి అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ తన ఊర్లో అమ్ముతుండేవాడు అదే క్రమంలో ఈరోజు మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యం వహించిన ఏఎస్ఐ రఘునారెడ్డి కానిస్టేబుల్ కరుణాకర్ ని సిఐ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version