ఐలయ్య చిత్రపటానికి నివాళులర్పించిన జర్నలిస్టులు..
భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ముంజాల ఐలయ్య చిత్ర పటానికి శనివారం స్థానిక జర్నలిస్టులు నివాళులర్పించారు. భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలోని 22వ వార్డు లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తాజా మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ తండ్రి అయిన ముంజాల ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా దశదినకర్మ కు జర్నలిస్టులు తడక సుధాకర్, చంద్రమౌళి, శ్రీను, వర్తక సంఘం నాయకులు హాజరై నివాళులర్పించారు. మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.