దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె విజయవంతం

దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె విజయవంతం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో కార్మికుల సమ్మె విజయవంతం అయిందని ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు
సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి కార్మికులకు 12 గంటల పని దినాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version