దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు.

అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న రామగిరికృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. డాక్టర్. ఏ శ్రీనివాస్ హెడ్ కెవికె. డాక్టర్ అర్చన ఎస్ఎంఎస్ అనిమల్ హస్బండ్రీ. డాక్టర్. నీరజన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐ సి ఏ ఆర్ హైదరాబాద్. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ. ఐటి శాఖ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులకు సాధారణంగా ఎప్పుడు వేసి వరి పంట కాకుండా ఇతర కూరగాయలు . మరియు చిరుధాన్యాలు పప్పు దినుసుల పంటలు సాగు చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జించి ఆర్థికంగా ఎదగాలని మరియు పెరటి కోళ్ల పెంపకం. పౌల్ట్రీ ఫార్మ్స్ ద్వారా. మరియు గొర్రెలు, ఆవులు, బర్రెలు. పెంచి వాటి ద్వారా ఆర్థికంగా రైతు లాభం పొందవచ్చని ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామాన్ని మూడు సంవత్సరాలు దత్తత తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు శ్రీనివాస్ తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలేఖ , సెక్రటరీ మల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ చిగురు స్రవంతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగల్ విండో డైరెక్టర్ పోతు పెద్ది రమణారెడ్డి.రైతులు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది.

నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి.

నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి

మూస పద్ధతులను విడనాడాలి

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…. రైతులకు అవగాహన కార్యక్రమం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

శనివారం కేసముద్రం రైతు వేదికలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను ప్రోగ్రాం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు ఈ విధమైన సలహాలు చేయడం జరిగింది
1. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలి
2. అవసరమేరకు మందులను పిచికారి చేసి మేలా ఆరోగ్యాన్ని కాపాడాలని
3. విత్తనాలు పురుగు మందుల మరియు ఎరువుల రసీదులు భద్రపరుచుకోవాలి
4. సాగునీటిని ఆదా చేసుకోవాలి
5. పంట మార్పిడి చేసుకోవాలి
6. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
7. పచ్చిరొట్ట ఎరువులు, పశువుల పెంట, చెరువు మట్టి వలన కలిగే ఉపయోగాలు.

వారు మాట్లాడుతూ వచ్చే వానకాలం సీజన్ 2025 -26
గాను వివిధ పంటలలో సాగు చేసే వివిధ రకాల విత్తనాలు మరియు మేలైన యాజమాన్య పద్ధతులు,
వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి మంచి దిగబడులు పొందే మీద సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
రైతులు పురాతన మూస పద్ధతులను విడనాడి, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి, ఖర్చులను తగ్గించి మంచి దిగబడులు, పొందాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా
కెవికె మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాక్టర్, ఎస్. మాలతి , ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ధనసరి అధ్యక్షులు మర్రి రంగారావు, సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు, కె వి కె మల్యాల శాస్త్రవేత్తలు డాక్టర్ రాంబాబు , డాక్టర్ క్రాంతి కుమార్ , మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, తోట వెంకన్న, ఆయా గ్రామాల అభ్యుదయ రైతులు, మండలంలోని ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజేందర్, శ్రీనివాస్, రవివర్మ, సాయి చరణ్, లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version