*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం…

*జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు శ్రీకారం…

*పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పని చేయండి…

జనసేన ఇన్ చార్జీ దేవర మనోహర్ పిలుపు

చంద్రగిరి(నేటి ధాత్రి:

 

 

చంద్రగిరిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శనివారం పార్టీ ఇన్
చార్జీ దేవర మనోహర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారని చెప్పారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమం గా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని తెలిపారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల అధ్యక్షులు మురళి, దూది జస్వంత్,కిషోర్,గురు,హరి ,తిరుపతి రూరల్ మండల ఇంచార్జ్ యువరాజ్,చంద్రగిరి మండల ఉపాధ్యక్షులు రాకేష్ మరియు సాదక్ నాయకులు,నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version