నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పణ

తొర్రూర్ డివిజన్ జూలై 2 నేటి ధాత్రి

బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తొర్రూరు లో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈసందర్బంగా బీజేవైఎం తొర్రూరు అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్ మాట్లాడుతూ

నీళ్ళు – నిధులు – నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం అని, గత BRS ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ యువత తరపున, నిరుద్యోగుల తరపున BJYM గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ నియంతృత్వ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా కాలం గడిపేస్తుంది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది.అని ఆవేదన వ్యక్తం చేశారు.

1. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి.

2. గ్రూప్ – 2, గ్రూప్ – 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలి.

3. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను Postpone చేసి నూతన తేదీలను ప్రకటించాలి.

4. అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి.

5. పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న G.O. No. 46ను వెంటనే రద్దు చేయాలి.

6. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి. పై డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించి నెరవేర్చాలని లేని పక్షంలో బీజేవైఎం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకోవల్సి ఉంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేష్, బీజేవైఎం తొర్రూరు అర్బన్ ప్రధాన కార్యదర్శి నూకల నవీన్, బీజేపీ, బీజేవైఎం నాయకులు సిహెచ్.విజయ్ కుమార్,పప్పుశెట్టి సంతోష్, శీలం శ్రీనాథ్, నడిగడ్డ సందీప్,కుమ్మరికుంట్ల శివ,మచ్చ ఉదయ్, నాగేష్ నాయక్,కె.రాంమ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version