– మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం లో తెలంగాణ సాయుధ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి వేడుకలు సందర్భంగా మంగళవారం చలో సిరిసిల్ల పోస్టర్లు చందుర్తి కురుమ సంఘం మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ…జులై 4 న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంంది. కావున అధిక సంఖ్యలో కురుమ, యాదవ, బడుగు, బలహీన వర్గాలు తరలిరావాలని అన్నారు.
అలనాడు నైజాం నిరంకుషత్వ పాలనకు, పెత్తందారులు, జరిగిందారులు, జగిందార్లు దోపిడీకి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి అంటూ సాగిన ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలి అయిన బహుజన బిడ్డ దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలకు మండలంలో నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లి విజయవంతం చేయాలని మండల కురుమ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, మాజీ సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్ యాదవ్, బత్తుల కమలాకర్, తిప్పని శ్రీనివాస్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య, మ్యాకల పరశురా