విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలు వినియోగం వల్ల నష్టాలు, సైబర్ నేరాలపై అవగాహన

విద్య తోనే ఏదైనా సాధ్యం… క్రమశిక్షణ తో ఉన్నత స్థానాలు అధిరోహించాలి..: ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్

ముత్తారం :- నేటి ధాత్రి

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు ముత్తారం ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ధైర్యపూర్ లో విద్యార్థులకు గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్ట్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి అదేవిదంగా కొత్తగా పెళ్లి కార్డ్స్ ఏ పి కే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్ , సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల https://www.cybercrime.gov.in కి గాని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 లకు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలని ఏసీపీ తెలిపారు.
ఈ సందర్బంగా ముత్తారం ఎస్ ఐ నరేష్ మాట్లాడుతూ
కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం చేడు అలవాటు లకు బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ తో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో జీవించాలి అని తల్లితండ్రుల ఆశలు నెరవేర్చలని, వారికీ, అధ్యాపకులకు, స్కూల్ కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, విద్యార్థునులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు ఏ సి పి రమేష్
హాస్టల్ లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనం చెక్ చేశారు భోజనం నాణ్యమైనది పెట్టాలని సిబ్బంది కి సూచించారు. హాస్టల్ పరిసరాలను, రూమ్స్ తనిఖీ చేయడం జరిగింది.
అంతే కాకుండా పాఠశాల ఆవరణను పరిశీలించి, పిచ్చి మొక్కలు విపరీతంగా ఉండటంతో వెంటనే బ్లేడ్ ట్రాక్టర్ ను తెప్పించి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయించినాడు.
ఈ కార్యక్రమంలో మంథని సీఐ రాజు, ముత్తారం ఎస్ఐ నరేష్, కళాశాల అధ్యాపక సిబ్బంది, ముత్తారం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version