ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల స్థానిక ధరియాపూర్ మోడల్ జూనియర్ కాలేజిలో ఇంటర్మీయట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కొరకు దరఖాస్తు స్పీకరిస్తున్నాము అని ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.10 వ తరగతి పాస్ అయిన విద్యార్థినీ,విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరం లో అడ్మిషన్ పొందుటకు మే 9వ తేది నుండి మే 31 తేది వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసి, గ్రూపుల గల నందు 40 సీట్లు చొప్పున మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.పదో వ తరగతిలో పొందిన జీపీఏ మార్కుల ఆధారంగా కోరుకున్న కోర్సులు నందు ప్రవేశం లభిస్తుందని అన్నారు.ఆసక్తి గల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన ఆన్లైన్ మెమో,ఆధార్ కార్డు,రెండు పాస్ ఫోటోలతో దడియపూర్ మోడల్ స్కూల్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫారం తో సమర్పించాలని తెలిపారు.